Saturday, April 14, 2012

దైవం మానుష రూపేణ....

దైవం మానుష రూపేణ....


మనం ఏదో అవసరంలో ఉంటాం. అనుకోకుండా ఎవరో సహాయం చేస్తారు. మనం ఆ మనిషి  దేవుడులా వచ్చి సాయం చేసాడని  మన కృతజ్ఞతలు తెలియచేస్తాం. మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకు అలా సహాయం చేసారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్పురిస్తాయి. అది మనం ఎప్పుడో ఎవరికో మనం చేసిన  సాయం వల్లో మనకీ సాయం దొరికిందని సరిపుచ్చుకుంటాం.  లేదంటే పూర్వ జన్మ సుకృతం అని సంతృప్తి చెందుతాం.  చాల మందికి రక రకాల నమ్మకాలుంటాయి. చేసే ప్రతి పనిలో కొందరి మాటను దైవంగా భావిస్తారు.  ఎందుకంటే కారణం చెప్పలేరు. అది కేవలం నమ్మకం అంతే. అలాటి నమ్మకమే దేవుడిపై మనిషుండే విశ్వాసం. ఆ నమ్మకమే మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఆ దైవభీతే మనిషిని నీతిగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆ నమ్మకమే సామన్యునితో  అద్భుతాలు చేయిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. కొందరు ఆ అదృష్టాన్ని అందుకుని అందలాలు ఎక్కితే మరి కొందరు ఆ విశ్వాసాన్ని భక్తిగా మార్చుకుని తమ జీవితాల్ని దైవసేవకు అంకితం చేసుకుని పునీతులవుతారు. మహర్షులవుతారు.


 ఏది ఏమైనా ఈ సృష్టిలో ప్రతి మానవుడి  ప్రథమ కర్తవ్యం తన  చుట్టూ ఉన్న మంచిని గుర్తించడం అది మనకు ఎంత శుభాన్ని కలిగిస్తున్నదో తెలుసుకోవడం. అది ఈ ప్రకృతి కావచ్చు, మనల్ని కాపాడే మన పెంపుడు జంతువులు కావచ్చు. అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి మన బాగు కోరుకునే  మన  జీవితభాగస్వామి కావచ్చు. నిరంతరం మన అభివృద్ధిని కాంక్షించే మన స్నేహితులు కావచ్చు, కేవలం మీరు దానం చేసే ఒక్క రూపాయి కి మీకు  వందేళ్ళ ఆయురారోగ్యాలు  కోరే మీ వీధి చివరి బిచ్చగాడు కావచ్చు. ప్రతి క్షణం మీ పని తన పనిగా చేసే మీ పనివాడు కావచ్చు. వీరంతా ఆ దేవుని స్వరూపాలే. నీవు నమ్మిన ఆ దేవుడు పంపిన దూతలే. ప్రతి ప్రాణి మరొక ప్రాణికి ఆ దైవం పంపిన సేవకులే. అవరసానికి అంది వచ్చే ఆ దేవుడి ప్రతినిధులే. సర్వం బ్రహ్మ మాయం అంటే ఇంకేదో కాదు ఇదేనేమో అని నా అభిప్రాయం. మనం చేసే మంచికి ఆనందపు ప్రసాదం, చెడుకు బాధల శటారిలు. జమాఖర్చు అన్ని సమానం. మనమంతా ఒకరికి ఒకరు దేవుడి స్వరూపాలే కాని, ఎవరికీ వారు మాత్రం కేవలం మానవ మాత్రులన్నవిషయాన్ని మనం మరిచిపోగూడదు. సాక్షాత్తు ఆ  దైవం మానవుడి అవతారం ఎత్తినపుడు మనిషిగా అన్ని విధులు నిర్వహించాడు, అన్ని కష్టాలు అనుభవించాడు. చివరకు చెడుపై విజయం సాధించాడు. దేవుడు ఈ లోక కల్యాణానికి ఎన్నో అవతారాలెత్తాడు. ఎందఱో మహానుభావుల రూపంలో ఈ మానవుల జీవితాల్ని ప్రభివితం చేసారు. అది శంకరచార్యుడైన, సాయిబాబా అయినా,  గౌతమ బుద్దుడైనా, వారంతా సామాన్యులుగా జన్మించి అసామాన్యులుగా జీవితాల్ని మలుచుకున్నవారు. వారి నందరిని  మనం దైవంగా ఆరాధించాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ అలంటి మహానుభావులెందరో.     


నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, లోకంలోని ఈ వికలాంగులు ఈ జీవ రాసులందరి తరఫున  వారు చేసిన పాపాలన్నిటికి తాము బాధ్యత  తీసుకుని, వారు ఈ అన్గావైకల్యమనే శిక్షను అందరి తరఫునా అనుభావిస్తునారేమో అని. అదే నిజమైతే, వారి విషయంలో మన బాధ్యత ఇంకా పెరగడం లేదా. వారిలో మనకు దైవం కనిపించడం లేదా? దేవుడికోసం చేసే ఎన్నో ఖర్చుల్లో కొంతైనా ఈ దైవస్వరూపాల కు చెందడంలో ధర్మం లేదా? మానవసేవ కూడా  మాధవ  సేవేనన్న గొప్ప విషయం మనకు తెలియనిది కాదు కదా. 


దైవం ప్రతిసారి, ఒకే రూపంలో ఉండకపోవచ్చు. కాని అది  అనునిత్యం అనేక విధాలుగా, మనల్ని కాపాడే అమోఘమైన ఒక శక్తి. అది దైవాన్ని పరిపూర్ణంగా, అనియమితంగా నమ్మినవారికి అడుగడుగునా సాక్షాత్కరిస్తాడు. ప్రతి మనిషిలో దర్శనమిస్తాడు. అందుకే మనం చేసే ప్రతి పనిలో మనం దైవాన్ని చూడాలి. మనం కలిసే ప్రతి వ్యక్తిలోని ఆ మహాశక్తికి  సాస్త్రాంగ నమస్కారం చేయగలగాలి. దైవం మనకు ఈరోజు, ఎరూపంలోనైనా  దర్శనం ఇవ్వవచ్చు. ఆ అపురూప ఘట్టాన్ని కోల్పోవద్దు. ఇదీ ఆ దేవుడిని కృపని పొందే మార్గమేనని గుర్తిద్దాం. జీవితాల్ని సాఫల్యం చేసుకుందాం. శుభస్య  శీఘ్రం.  

Monday, January 2, 2012

శరణా గతి - ఒక జీవన విధానం


శరణా గతిఒక జీవన విధానం  
నీ  జ్ఞానం పరిమితం. లోపభూయిష్టం. నీ సామర్థ్యం  అతి స్వల్పం.నీ జీవితం మరీ సూక్ష్మం. నీవు ఆలస్యాన్ని భరించలేవు. అందుకే నీకు పూర్తిగా అర్థం కాని విషయాలను కూడా నువ్వు సాధించాలని ప్రయత్నం చేస్తావు. ఘోర పరాజయాన్ని పొందుతావు. ఎంతో ఆలస్యంగా పరిస్థితిని అర్థం చేసుకుంటావు. ఫలితాన్ని తప్పించుకొనుటకు ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తావు. అవి ఎంత దూరమో, అనుభవించడం ఎంత కష్టమో తెలుసుకునే లోపే జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. నీ బాధ్యతల్ని నీవు నిర్వర్తించలేదు. సంఘ నియమాల్ని పాటించలేదు. ఎవరి అంచనాలను నీవు చేరలేదు.ఎవరి ఆశలు నీవు తీర్చలేదు. ఇప్పుడే ఈలోకంలోకి వచ్చ్నినట్టుంది.అప్పుడే జీవితపు చివరి మజిలి దగ్గరపడినట్టుంది.  స్థితిలో నీవు ఎవరిని తలుచుకుంటావు?. ఎవరు నీ సమస్యకు సమాధానం చెపుతారు?. అప్పుడు కేవలం నీకున్న ఒకే ఒక్క ఉపాయం ఏది?.

అదే  అన్ని లోకాలను రక్షించే  ఒకే ఒక్క శక్తి. నీకు అండగా నిలుస్తుంది.   అదే నీకు సర్వస్వం అవుతుంది.  శక్తికి నిన్ను నువ్వు సమర్పించుకో.  శక్తే భగవంతుడు. నీ బాధలన్ని తీర్చే బాధ్యత తీసుకున్న పరమ శక్తి. తన పంచాంగాలతో నిన్ను రక్షించే మహా శక్తి. ఇప్పుడు నువ్వు  భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడివి. ఎంతో దయగల  సౌందర్యవంతుడు   లోకం లోని అన్ని కష్టాలనుండి నిన్ను మానసికంగా దూరం చేసి నీకు ఆనందపు పారవశ్యాన్ని పొందేట్టు చేస్తాడు. నిన్ను  ఐహిక బంధాలనుండి విముక్తున్ని చేస్తాడు. అంతం లేని అవరోధాల బాధల్ని పటాపంచలు చేస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ఆనందాన్ని నీదిగా చేస్తాడు. నీతో పసి పాపవుతాడు. సర్వం నీవు తనలో మమేకమవుతావు. సంపూర్ణ అనుభవాన్ని ఆనందాన్ని పొందుతావు. అదే శరణాగతి. నీవు దక్క  వేరే లోకం లేదనే తాదాత్మ్య స్థితి. అక్కడ కన్నీళ్లు లేవు. గాయాలు లేవు. కుట్రలు కుతంత్రాలకు స్థానం లేదు. సర్వం బ్రహ్మ మయం. ఇదే భగవద్గీత శ్లోక సారం. ఇదే  అత్యంత ఉన్నతమైన శ్లోకం. 
"సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజఅహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"
మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  అదే మనమనే స్వర్గం. అదే లేనప్పుడు మనిషికి కలిగే బాధలే నరకం. నిన్ను అన్ని ఐహిక పాపాల  నుండి  విముక్తున్ని చేసి మోక్ష సాధనకు భగవద్గీత చూపిన ఉత్తమమైన మార్గం. నిన్ను నీవు భగవంతుడికి అంకితం చేసుకుని నీ కర్మ నీవు పాటించు. అంతా తానై నిన్ను తనలో ఐక్యం చేసుకుంటాడు. అదే కైవల్య మార్గం. ఖురాన్ బైబిల్ కూడా ఇదే విషయం తు  తప్పకుండా చెపుతాయి. మతం ఏదైనా సారం ఒక్కటే. అదే ఏదో ఒక శక్తికి నిన్ను శరణాగతి చేస్తుంది. అదే ప్రతి జీవికి, జీవితానికి పరమార్థం.